నేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి వీరిద్దరూ విడిపోయే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ జంట విడాకుల పుకార్లను కొట్టిపారేశారు. తన పాటల కంటే స్టుపిడ్ రూమర్లే వేగంగా వ్యాపిస్తాయని హేమచంద్ర చమత్కరించారు.
“నా పాటల కంటే అనవసరమైన, అసంబద్ధమైన, తెలివితక్కువ సమాచారం చాలా వేగంగా వ్యాపిస్తుంది” అని అతను ఇన్స్టాగ్రామ్లో రాశాడు. పుకార్ల ను నమ్మవద్దని శ్రావణ భార్గవి సూచించింది. గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్ ఛానెల్కు వ్యూస్ వస్తున్నాయని చెప్పింది.
ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్ల సంఖ్య పెరిగిందని ఆమె తెలిపారు. “నేను సాధారణంగా చేసేదానికంటే ఎక్కువ పని చేస్తున్నాను, నేను సాధారణంగా చేసేదానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మంచి కాల్. సరైనది లేదా తప్పు, మీడియా లో ఇలా రూమర్లు రావడం ఒక దీవెన” అని మహిళా గాయని వ్యంగ్యంగా చెప్పారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి 2013 నుండి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వారికి ఒక పాప కూడా ఉంది.