హిందుత్వం అంటే మతం కాదని అది ధర్మం అని వక్తలు ప్రసంగించారు. విజయనగరం అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం పేరిట జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. హిందూ ధర్మ రక్షా సమితి అద్వర్యం స్టానిక అయోద్య మైదానంలో హైందవ శంఖారావం పీట భారీ బహిరంగ సభ జరిగినది. ఈ సభలో ముఖ్య ప్రసంగీకులు మహా మండలేశ్వర్ యోగ పీఠం సురేశ్వరానంద యోగి మహారాజ్ వారి శిష్యులు యోగి అతిదేశ్వరానంద పర్వత మరియు రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు.
వారితో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడపు విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అద్యక్షులు చేదులూరి గవరయ్య కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ ప్రసంగించారు. హిందూత్వం అంటే మతం కాదు ధర్మం అని హిందూ ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని అన్నారు. విజయనగరాన్ని కేంద్ర బిందువు గా హిందూత్వ భావజాలాన్ని అందరికి తెలియజేయాలని తెలిపారు. అధ్యక్షులు రాయపాటి రామ రాజు, కార్యదర్శి శఠగోపం పార్థ సారధి, కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు ఆబోతుల శ్యాం సుందర్ సభాధ్యక్షత న కార్యక్రమం జరిగింది.