రాజస్థాన్ రాజధాని జైపూర్ ర్యాలీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వవాదులు తనపై దాడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంచేసినా ప్రజల కోసం భయపడేదీలేదన్నారు. భారతదేశం హిందువుల దేశం, హిందుత్వవాదులది కాదని అన్నారు. అదే సమయంలో నేను హిందుత్వవాదిని కాదు, హిందువును అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
హిందూ, హిందుత్వ రెండు వేర్వేరు పదాలుగా అభివర్ణించిన రాహుల్ గాంధీ.. రెండు జీవరాశులకు ఒకే ఆత్మ ఉండదని, అదే విధంగా రెండు పదాలకు ఒకే అర్థం ఉండదని అన్నారు. రాహుల్, కాంగ్రెస్లు హిందుత్వానికి రంగం సిద్ధం చేశారంటూ ట్వీట్ చేస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం భారతీయులందరికీ చెందుతుందని, ఒక్క హిందువులకే కాదని అన్నారు. భారతదేశం అన్ని మతాల ప్రజలకు చెందిందని అన్నారు.