చిత్తూరు జిల్లా లో దారుణం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో 6 సంవత్సరాల ఒక పేద బాలిక పై వైసిపి కార్యకర్త అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సభ్య సమాజానికే తలవంపులుగా ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీ లో మత్యకార నిరుపేద కుటుంబానికి చెందిన 6 సంవత్సరాల బాలిక పై వైసిపి కార్యకర్త మునిరాజా అత్యాచారం చేశాడనే ఫిర్యాదు అందింది.
ఈ సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అధికార పార్టీ కార్యకర్త అయినందున కేసును బలహీనపరిచి పోలీసులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి క్రూర మృగాలను నడి రోడ్డు పైన ఉరి తీయాలని వినుత డిమాండ్ చేశారు.
ఎన్ని దశ లేని దిశా చట్టాలు వచ్చినా ఏమి ప్రయోజనం? సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నానిందితుడిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రేణిగుంట మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, నాయకులు త్యాగరాజులు, పార్థసారథి , నాగరాజు,వెంకటేష్, వీర మహిళలు ఉమా మహేశ్వరి, భాగ్యలక్ష్మి, జయలలిత, జనసైనికులు పాల్గొన్నారు.