అపదలో ఉన్నవారికి హోప్ ఫౌండేషన్ ఏంతో అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ తెలిపారు. శనివారం ఏమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మియాపూర్ ప్రాంతంలో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ భార్య మంగదేవి అనారోగ్యం కారణంతో ఆసుపత్రి పాలయ్యారు.
వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ చేతుల మీదుగా రూ 10 వేల రూపాయలను బాదితురాలి కుటుంబానికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరెటర్ రాగం నాగేందర్ యాదవ్, రెడ్డి రఘనాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.