భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్థాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫిలింనగర్ పరిధిలోని దుర్గాభవానీ నగర్కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివాని అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి.
దీంతో తాజాగా శివాని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో పాటు కుటుంబీకులతో శివాని మాట్లాడకపోవడంతో భర్త నరసింహ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఫ్యాన్కు ఉరేసుకుని నరసింహ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.