కోహిమాలోని ఖుజమాలో నార్కోటిక్ చెక్ పాయింట్ వద్ద చేసిన తనిఖీలలో సుమారు 48 కిలోల బంగారం, రూ. 29 కోట్ల ఖరీదు చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులగా నార్కోటిక్ చెక్ పాయింట్లలో నిర్వహించిన తనిఖీలో ఇవి వెలుగు చూశాయని చెప్పారు.
మయన్మార్ నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్య ప్రాంతాలకు తరుచుగా మాదక ద్రవ్యాలు, ఆయుధ సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని అస్సాం రైఫిల్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు వెల్లడించారు.