సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలోని స్వయంవ్యక్త శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మంగళవారం నుండి ఐదు రోజుల పాటు జరగనున్నాయి.
జాతరకు పోలీసు శాఖ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తుంది. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ అధ్వర్యంలో మేళ్ళచెరువు జాతర ప్రదేశం,మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. జాతర ప్రాంగణం మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని రక్షణ వలయం ఏర్పాటు చేశారు.
మహా జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా భారి బందోబస్తు నడుమ జాతర జరుగుతుందని,ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పక్క వ్యూహంతో పోలీసు ముందుకు వెళుతున్నారని. ఎవరైనా గొడవలకు దిగినా,ఇతరులను ఇబ్బందులకు గురి చేసినా కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.సిసి కెమెరాలు,పోలీస్ కంట్రోల్ రూమ్స్ ద్వారా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని,అనుమానిత వ్యక్తులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
ఈ కవాతు నందు జిల్లా అధనపు ఎస్పీ రితిరాజ్ ఐపిఎస్,డిఎస్పీ రఘు,సిఐ లు,ఎస్సై లు,సిబ్బంది పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్