తెలంగాణ లో బిజెపి అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును మారుస్తామని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ మీటింగ్ అంటూ అనవసరంగా ప్రాపగండా చేస్తున్నారని, రహస్యంగా ఇలాంటి సమాచారం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను బహిరంగంగానే చెబుతున్నానని హైదరాబాద్ పేరు మారుస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పేరే కాదు తెలంగాణలో అనేక ప్రాంతల పేర్లని మారుస్తాం అని ఆయన ప్రకటించారు. ఒక్క భాగ్యనగరం పేరేకాదు సికింద్రబాద్, కరీంనగర్, నిజమాబాద్ లతో పాటు మిగతా నగరాల పేర్లూ మారుస్తాం అని ఆయన స్పష్టతనిచ్చారు. నిజాం దౌర్జాన్యాన్ని ప్రజల ముందు పెడతా.. నిజాం కట్టడాలను ధ్వంసం చేస్తాం. దేశం కోసం అమరులైన వారి పేరును జిల్లాలకు పెడతాం అని రాజాసింగ్ తెలిపారు.
previous post