రాష్ట్రంలో రేపటి నుంచి పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ లో మీడియతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రకటించిన 5 కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు అందజేస్తుందని ప్రకటించారు.
కేంద్రం కేవలం ఆహారభద్రత కార్డుదారులకే ఇస్తుందని అన్నారు….. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. దీనితో 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం జులై నుంచి నవంబర్ వరకు ఇస్తామని స్పష్టం చేశారు.
బియ్యం పంపిణీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభిస్తారు. ఈ పంపిణీ జూలై నుంచి నవంబర్ నిరంతరయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఆర్ధిక మాంద్యం నెలకొన్నప్పటికి …నిరుపేదలు పస్తులుండకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రానికి ప్రతి నెల 50 కోట్ల రూ అదనపు భారం పడుతుందని …5 నెలలకు 250 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో 1 కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెలకు అవసరం పడుతుందని, కానీ ఇప్పుడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునిల్ రావు ,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ,కార్పొరేటర్లు ఐలేందేర్ యాదవ్ కంసాల శ్రీనివాస్ ,చాడగొండ బుచ్చి రెడ్డి ,గుగ్గిళ్ల జయశ్రీ ,కొల ప్రశాంత్ లు పాల్గొన్నారు.