23.7 C
Hyderabad
May 8, 2024 06: 48 AM
Slider ఆధ్యాత్మికం

రుక్మిణి,సత్యభామ,సీతా,రామ,లక్ష్మణులకు రజితాభరణాల బహుకరణ

#hujurnagartemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి 1 కిలో 259 గ్రాముల రజిత ఆభరణాలను హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వంకాయలపాటి విమలమ్మ కుమారుడు హరిప్రసాద్, శ్రీదేవి దంపతులు బహుకరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి తెలిపారు. రుక్మిణి, సత్యభామ దేవేరులకు వక్షస్థల కవచాలు, సీతా, రామ, లక్ష్మణ స్వాములకు వక్ష కవచాలు, కిరీటాలు, ధనుర్భాణాలు వీటిలో ఉన్నాయి. బహుకరించిన రజిత ఆభరణాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు అలంకరించారు.అనంతరం హరిప్రసాద్ శ్రీదేవి దంపతులకు వేద ఆశీర్వచనం  చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు హరిప్రసాద్,శ్రీదేవి లకు స్వామి,అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,ఆలయ చైర్మన్ ముడుంబ జగన్నాధాచార్యులు,ధర్మకర్తలు రామిశెట్టి రాము,వెన్న పద్మ,లక్క వెంకన్న,దోసపాటి నర్సింహమూర్తి,కోలపాటి వేంకటేశ్వర్లు, మెరిగ గురవయ్య,నరగిరినాధుని నర్సింహాచార్యులు,స్థానాచార్యులు ముడుంబ శ్రీనివాసాచార్యులు, రామకృష్ణమాచార్యులు,దామోదరాచార్యులు,ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు,భాస్కరాచార్యులు,భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్దం

Bhavani

గ్రేట్ సర్వీస్:గర్భిణీ స్త్రీనిఆసుపత్రిలో చేర్పించిన సీఆర్ఫీఎఫ్

Satyam NEWS

ములుగులో ఘనంగా మండల పూజోత్సవాలు

Satyam NEWS

Leave a Comment