నా ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు పోను..అని ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
చేశారు. తెలంగాణ ను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం.. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు.
గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారు.. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయను… బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారు అని ఆయన చెప్పారు.