తనపై తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్, ఓనర్లకు నోటీసులు పంపామని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. తాను ఒకటి చెప్తే ఒకటి రాసిన విలేకరిని అసలేం జరిగిందో తెలుసుకున్నాక స్పందించాల్సింది పోయి తనను క్షమాపణ ఎలా అడుగుతారని జర్నలిస్ట్ యూనియన్ నాయకులను ప్రశ్నించారు. తాను క్షమాపణ చెప్పాలని వాట్సాప్ గ్రూపుల ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ పంపిన యూనియన్ నాయకులను ఒకటే అడుగుతున్నా.. నేను మాట్లాడిన వీడియోలు పంపిస్తా.. మొత్తం చూసి నమస్తే తెలంగాణలో వార్త వచ్చింది నిజమా అబద్దమా చెప్పాలన్నారు. మిగతా ఏ పత్రికల్లో వార్త రాలేదని, అలాగని మిగతా పత్రికలు తప్పుగా రాసాయా.. క్షమాపణ ఎవరు ఎవరికి చెప్పాలో నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తప్పు నాదే ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తప్పు లేకుండా తన వ్యక్తిత్వం మీద వార్తలు రాస్తే ఇలాగే మాట్లాడుతానన్నారు. తప్పు చేస్తే ముక్కు నేలకు రాయడానికి కూడా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
previous post
next post