ఉమ్మడి కడపజిల్లా సిద్ధవటం మండలంలో జంగాలపల్లె ఇసుక రీచ్ గడువు ముగిసిన అక్రమంగా నిర్వహించడం పై పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించిన జంగాలపల్లె గ్రామస్తులు దెబ్బకు రీచ్ మూతపడే బీజాలు బయటపడ్డాయి. టిప్పర్ ఆటో డీ కారణంగా అతి ఘోరంగా గాయాలు పాలైన వ్యవసాయ కూలీలు ఆసుపత్రిలో చేరిక, కూలీలకు కాళ్లు చేతులు విరిగిపోయాయి.
ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన పార్టీ, తరుపున రాజంపేట నియోజకవర్గం యువ నాయకులు దినేష్ వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఇసుక రీచ్ మూసివేయాలని గ్రామస్తులు కలిసి ఆందోళన చేయడం వారి కుటుంబాలకు భరోసా ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం ఇక తెలుగుదేశం పార్టీ తరపున దశరథ నాయుడు మోహన్ రెడ్డి వైద్యశాల కెళ్ళి వారిని ఆర్థికంగా భరోసా ఇచ్చి, ధైర్యంగా ఉండమని చెప్పినా ఇవన్నీ గ్రామస్తులకు కంటనీరు తప్ప లేదు.
ఒక్కసారిగా కట్టలు తెంపుకొని వచ్చిన ఆగ్రహం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు రంగ ప్రవేశం గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన ఇసుక క్వారీలో నిరసన తెలపడం గ్రామస్తులకు అండగా నిలవడం ఇవన్నీ చేపట్టి అసలు రంగు బయటపడింది.గడువు ముగిసినా అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా లూటీ చేసిన ఇసుక బకాసురులపై జంగాలపల్లె గ్రామస్తులు దైర్యంగా తిరగ బడడంతో అధికారులల్లో కదిలిక వచ్చింది.