27.7 C
Hyderabad
May 12, 2024 03: 43 AM
Slider ప్రత్యేకం

పోలీస్ వాహనాన్నే “ఢీ” కొట్టిన ఇసుక మాఫియా

#sandmafia

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని దుందిబి వాగు నుండి ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మిడ్జిల్ మండల పరిధిలోని దుందుభి వాగు నుండి ఇసుకను జడ్చర్ల, షాద్ నగర్, కల్వకుర్తి తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

ఇసుక మాఫియా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతుంటే పట్టించుకోవాల్సిన పోలీస్, రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవరించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బరితెగించిన ఇసుక మాఫియా జడ్చర్ల ఎస్సై వెంకటేష్ పై దాడికి దిగింది.

సోమవారం మిడ్జిల్ మండల పరిధిలోని దుందుభి వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తూ జాతీయ రహదారి 44 నుండి జడ్చర్ల క్లబ్ రోడ్డు మీదుగా జడ్చర్ల పట్టణంలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న జడ్చర్ల ఎస్సై వెంకటేష్ ఇసుక వానని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనంపై వెళ్లిన జడ్చర్ల ఎస్సై వెంకటేష్ ను ఇసుక మాఫియా లారీ తో ఢీ కొట్టింది. దీంతో ఎస్ఐ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం స్వల్పంగా ధ్వంసం కాగా ఎస్సైకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే ఇసుక మాఫియా వానాన్ని ఆపాలని ఎస్సై అడిగినా వాహనాన్ని ఆపకుండా సినీ ఫకీలు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం విడ్డురం.

దీంతో ఎంతో చాకచక్యంగా ఇసుక మాఫియా లారీని వెంబడించి ఎస్సై వెంకటేష్ పట్టుకోవడంతో చేసేదేమీ లేక ఇసుక మాఫియా ఆగిపోయింది. దీంతో ఎస్సై ఇసుక మాఫియాకు చెందిన లారీని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు వద్దంటూ….తాను ఓ  ప్రజాప్రతినిధికి చెందిన వ్యక్తినని,  తనని విడిచి పెట్టాలని లేదంటే పరిణామాలు వేరే ఉంటాయని సదరు ఇసుక మాఫియా పోలీసులను హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.

పోలీసులపై ఓ ప్రజాప్రతినిధిని నుండి ఒత్తిడి తీసుకొచ్చి కేసు నమోదు చేయొద్దని ఇసుక మాఫియా చేసిన ప్రయత్నాలను నేనుసైతం దృష్టికి రావడం గమనార్హం. దీంతో ఇసుక మాఫియా ఆగడాలను ఎస్సై పై ఇసుక మాఫియా చేసిన దాడిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో, చేసేది ఏమీ లేక ఇసుక మాఫియా, ఆ ప్రజా ప్రతినిధి సైతం పోలీసులపై ఒత్తిడిని కాస్త తగ్గించినట్లు తెలిసింది. దీంతో జడ్చర్ల పోలీసులు జడ్చర్ల దేవుని గుట్ట తండా కు చెందిన కేశవ దేవేందర్ పై కేసు నమోదు చేసి టీఎస్ 32 టి 2388 భారత్ బెంజ్ ను సీజ్ చేసి 379 మైనింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఇసుక మాఫియాను అరికట్టాలి

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫీయా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోయాయని, ఇసుక మాఫియాను అరికట్టాలని తాము గత పదకొండు సంవత్సరాలుగా పోరాడుతున్నామని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జడ్చర్లలో ఎస్ఐ వెంకటేష్ పై ఇసుక మాఫియా దాడిని ఆయన ఖండించారు.

అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు రెవిన్యూ మైనింగ్ శాఖా అధికారులు ఇసుక మాఫియా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి వరకు తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని, ఇకనైనా ఇసుక మాఫియా తన బరితెగింపులను మాని ఇసుక అక్రమ రవాణాను మానుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Satyam NEWS

వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

Satyam NEWS

Leave a Comment