చిత్తూరు జిల్లాలో నాటు సారా బట్టీలను స్పెషల్ పార్టీ పోలీసులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం , రాసన పల్లె గ్రామ అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు నాటుసారా స్థావరాలు గుర్తించారు. మొత్తం 50 లీటర్ల నాటుసారాను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా ఐదు వేల లీటర్ల సారా ఊట బెల్లం ధ్వంసం చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అయితే పోలీసులను చూసిన నాటు సారా తయారీ దారులు పరారయ్యారు. గుడిపాల పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.