38.7 C
Hyderabad
May 7, 2024 17: 28 PM
Slider తూర్పుగోదావరి

కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రామారావు

కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పీతల అచ్యుత రామారావుని నియమిస్తూ ప్రెస్ క్లబ్ కార్యనిర్వాహక కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. క్లబ్ ఉపాధ్యక్షుడు గుబ్బల ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు సారధ్యంలో కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

బుధవారం కాకినాడ ప్రెస్ క్లబ్లో ఈసీతో పాటు క్లబ్ సభ్యుల సమావేశం జరిగింది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన మంగా వెంకట శివరామ కృష్ణ నిర్లక్ష్య ధోరణిని అపరాధంగా పరిగణించి కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆయన్ని సభ్యుల తీర్మానంపై అనర్హుడుగా భావించి అధ్యక్ష స్థానం నుంచి తొలగించినట్లు ప్రధాన కార్యదర్శి జి శోభన్ బాబు తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన రామారావు మాట్లాడుతూ తనపై విశ్వాసంతో కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సభ్యుల సంక్షేమానికి సమిష్టిగా కృషి చేసి కాకినాడ ప్రెస్ క్లబ్ ప్రతిష్ట మరింత పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రామారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు వీధి సాయినాథ్, ఎస్టి మూర్తి, డి మోహన్, ఈసి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రెస్ క్లబ్నకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామారావును పలువురు అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు అందించారు.

Related posts

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

వాడ వాడకు పువ్వాడ

Bhavani

వైద్య కళాశాల నిర్మాణ పనుల పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్

Satyam NEWS

Leave a Comment