27.7 C
Hyderabad
May 4, 2024 08: 26 AM
Slider క్రీడలు

ఇండియా-పాక్‌ మ్యాచ్ కు దిమ్మదిరిగే వ్యూస్

లీగ్​ దశలో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్​లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను జనాలు ఓ రేంజ్‌లో చూశారు. ఏకంగా 167 మిలియన్ల మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇండియాలో ఈ మ్యాచ్​ను 15.9 బిలియన్​ నిమిషాల పాటు చూసినట్లు వివరించింది.

మొత్తం టోర్నీని 112 బిలియన్​ నిమిషాలు వీక్షించినట్లు వెల్లడించింది. గతంలో 2016 టీ20 వరల్డ్ కప్​ సెమీఫైనల్స్​ మ్యాచ్​కు (టీమ్​ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. మిగతా మ్యాచ్​లకు వచ్చిన వ్యూయర్​షిప్​ కన్నా ఇండియా​-పాక్​ మ్యాచ్​కు 60శాతం, ఈ టోర్నీకి ఏడు శాతం పెరిగినట్లు ఐసీసీ వివరించింది.

Related posts

క్రియేటీవ్ సిటీస్ జాబితాలో హైద‌రాబాద్ న‌గ‌రం

Satyam NEWS

రియల్ ఎస్టేట్ వాళ్లకు రైతుబంధు ఇస్తున్న కేసీఆర్

Satyam NEWS

నేలపాలైన 3000 లీటర్ల మద్యం

Sub Editor

Leave a Comment