లీగ్ దశలో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ను జనాలు ఓ రేంజ్లో చూశారు. ఏకంగా 167 మిలియన్ల మంది ఈ మ్యాచ్ వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్ను ఇంతమంది వీక్షించడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇండియాలో ఈ మ్యాచ్ను 15.9 బిలియన్ నిమిషాల పాటు చూసినట్లు వివరించింది.
మొత్తం టోర్నీని 112 బిలియన్ నిమిషాలు వీక్షించినట్లు వెల్లడించింది. గతంలో 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్కు (టీమ్ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిగతా మ్యాచ్లకు వచ్చిన వ్యూయర్షిప్ కన్నా ఇండియా-పాక్ మ్యాచ్కు 60శాతం, ఈ టోర్నీకి ఏడు శాతం పెరిగినట్లు ఐసీసీ వివరించింది.