ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం అక్రమ విక్రయాలపై చర్య తీసుకుంటుంది. ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం కాబూల్లోని కాలువలో సుమారు 3,000 లీటర్ల మద్యాన్ని పారబోసింది. ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ చర్యకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.
వీడియో ఫుటేజీలో ఏజెంట్లు బ్యారెళ్లలో నిల్వ చేసిన మద్యాన్ని కాలువలో పోయడం కనిపించింది. రాజధానిలో అధికారులు జరిపిన సోదాల్లో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశారు. “ముస్లింలు మద్యం తయారు చేయడం, పంపిణీ చేయడం తీవ్రంగా ఖడిస్తున్నామని చెప్పారు.
అధికారుల దాడుల్లో ముగ్గురు డీలర్లను పట్టుకున్నట్లు ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఆ దేశంలో చాలా సంవత్సరాలుగా మద్యం అమ్మడం, సేవించడం నిషేధించారు. మద్యం వినియోగంపై తాలిబాన్లకు కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది.