మునుగోడులో అధర్మం గెలిచిందని బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆరెఎస్ అదికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఓటమిని అంగీకరించిన బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాల్ రెడ్డి టీఆరెఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఆరెఎస్ నేతలు ప్రజల్ని బెదిరించారన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేశారన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం పై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానాని, ఎన్నికలలో నైతిక విజయం తనదేనని, ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.