తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కేరళ బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుమలత పిలుపునిచ్చారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ భరత్ నగర్ శక్తి కేంద్ర ప్రముఖ్ ఎడెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో నేడు ఆమె పాల్గొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ సభ్యులు ఏ రకంగా పని చేస్తున్నారో పర్యవేక్షించారు. కార్యకర్తలు అందరూ ఇదే స్ఫూర్తిగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు విశ్రమించకుండా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెంకట్ రెడ్డి , హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్ కుమార్, డివిజన్ బిజెపి అధ్యక్షుడు చుక్క జగన్, పోలింగ్ బూత్ ఇంచార్జ్, అధ్యక్షులు, కార్యదర్శి, పన్నా ప్రముఖులు ఏడెల్లి రామ్, ఎడెల్లి బాలు, వంగూరు సుధాకర్, శ్యామ్, మస్కా మహేష్ కుమార్, ఎడెల్లి సుధాకర్, ఎడెల్లి బాలాజీ, జేరిపోతుల అనిల్ కుమార్, సునంద, కవిత, రవీందర్,ఏడెల్లి మల్లేష్, ఏడెల్లి శ్రీను, భార్గవ్, వెంకటరమణ, మైలారం ప్రవీణ్ కుమార్, రామ్ రెడ్డి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట్
previous post
next post