అమెరికాలో సంచలన మహిళా నాయకురాలుగా పేరుగాంచిన నిక్కీ హేలీ తో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు. నిక్కీ హెలి తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం, తన భారత మూలాలను ఘనంగా ఎల్లప్పుడూ చాటి చెప్పుకునే మహిళా నాయకురాలు కావడం మనకు గర్వకారణమని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అమెరికా రాజకీయాలలో ఆమె క్రియాశీలక కీలకమైన పాత్ర పోషించడం భారతీయులందరికీ గర్వకారణం అని, ఆమె అమెరికా దేశ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావాలని రాజేంద్రప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో వై.వి.బి రాజేంద్రప్రసాద్, నాట్స్ మాజీ అధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసరావు, పిన్నమనేని ప్రశాంత్, ఎన్నారై టిడిపి నాయకులు శ్రీనాద్ రావుల మర్యాదపూర్వకంగా ఆమెను కలిసినవారిలో ఉన్నారు.
అమెరికా దేశంలోని, సౌత్ కరోలినా రాష్ట్రానికి ప్రప్రథమ మహిళా గవర్నర్ గా 39 సంవత్సరాల వయస్సుకే ఎన్నికలలో గెలిచి ఆమె సంచలనం సృష్టించారు. పిదప ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసి, రిపబ్లిక న్ పార్టీ అగ్రశ్రేణి నాయకురాలుగా రాబోయే అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా పోటీపడుతున్నారు. ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తరఫున MLC గా 2 సార్లు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారని, తోటకూర ప్రసాద్ వై.వి.బి ని నిక్కీ హేలి కి పరిచయం చేశారు.