29.7 C
Hyderabad
May 2, 2024 03: 15 AM
Slider అనంతపురం

రాప్తాడుతో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం

అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసులు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు రాప్తాడు బస్టాండ్ ఆవరణలో మానవ హారంగా ఏర్పడి స్త్రీ హింసను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ స్త్రీ హింస నిర్మూలన చట్టాలపై అవగాహన చేశారు. అంతేకాకుండా 60 జంటలకు క్రీడా పోటీలు నిర్వహించి హింసకు తావు లేకుండా భార్యాభర్తలు ఆనందంగా కొనసాగేందుకు సంకేతాలు పంపారు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

కంటైన్మెంట్ జోన్ లో ప్రతిరోజు థర్మల్ స్క్రీనింగ్ చేయండి

Satyam NEWS

కరోనా తగిలించిన తబ్లిగీ జమాత్ పై పాకిస్తాన్ ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment