వనపర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు వస్తున్నదని ముఖ్య మంత్రి కెసిఆర్ వనపర్తిలో చెప్పారు. వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడు నిరంజన్ రెడ్డి అన్నారు. గతంలోని మంత్రులు జిల్లాకు ఒక్క మొడికల్ కళాశాల తీసుకురాలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. వనపర్తి ప్రజలు కులాలు, మతాలకు అతీతంగా నిరంజన్ రెడ్డిని దగ్గరుండి గెలిపించాలని కోరారు. నీళ్ల నిరంజనుడు జిల్లాను సాధించారని, మిగిలిన పనులూ పూర్తి చేసే బాధ్యత నాది అన్నారు. వనపర్తిలో సభను విజవంతం చేసిన ప్రజలకు, అభిమానులకు, నేతలకు, కార్యకర్తలకు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్