దేవుడి ఆస్తుల్ని కొందరు అన్యాక్రాంతం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూములంటే ఎందుకు అంత అలుసు? దేవాదాయ మంత్రి కోట్టు సత్యనారాయణ ఆలయాలు పరిస్థితిని పట్టించుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వక్స్, చర్చి భూములు మీద ఉన్న శ్రద్ధ దేవాలయ భూములమీద మీ ప్రభుత్వానికి ఎందుకు లేదు? దేవుడి భూములని కోర్టుచెప్పినా స్వాధీనం చేసుకోరా? అని ఆయన ప్రశ్నించారు. చిన్న ఆలయాలకు నిధులు లేక ధూపదీప నైవేద్యాలు చేయడం లేదు. కొందరు పాలక మండలి సభ్యులు ఆలయ నిత్య వ్యవహారాల్లోజోక్యంచేసుకుంటున్నారు. దేవుడి ఆస్తి గజం పరులపాలైనా బీజేపీ చూస్తూ ఊరుకోదు అని ఆయన హెచ్చరించారు. ఈ భూములపై తక్షణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
previous post
next post