హైదరాబాద్ లోని బాగ్ అంబర్పేట్ రామకృష్ణ నగర్ లో జరుగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జాప్యంతో సాగుతున్న పనుల కారణంగా కలుగుతున్న ఇబ్బందులను స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డ్రైనేజీ పైపులైను పనులు జరుగుతున్న సమయంలో ఇంట్లోకి వెళ్తున్న మంచినీటి పైపులైన్లు కట్ అయిన వాటిని సరి చేయాల్సిన అవసరముందన్నారు. డ్రైనేజీ పైపులైను వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, మల్లారెడ్డి, షరీఫ్, కవిత, నర్సింగ్ రావు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట
previous post