37.2 C
Hyderabad
May 6, 2024 21: 35 PM
Slider విజయనగరం

ఈ నాలుగేళ్లు జగన్ ప్రభుత్వం పడుకుంది…!

#TDP

ఈ నాలుగేళ్ళ జగన్ ప్రభుత్వం పడుకుందని..ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమ పనులు కానీ జరగలేదని విజయనగరం జిల్లా టీడీపీ విమర్శించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తో పాటు మాజీ మంత్రి కోండ్రు మురళీ, కే.ఏ.నాయుడు, ఐవీపీ రాజులు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని చెబుతున్న జగన్ ప్రభుత్వం… ఒక్క పరిశ్రమ గాని.. ఒక్క పధకం కాని అమలు చేసాడా అని నాగార్జున ప్రశ్నించారు.

నాలుగేళ్ళ క్రితం టీడీపీ వేసి శంకుస్థాపన కాదని… తదనంతరం అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం.. అన్ని వేల ఎకరాలలో ఏర్ పోర్ట్ నిర్మించి..ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్న మాటలను ఎవరిని మభ్య పెట్టేందుకు అని నిలదీశారు. కేవలం పార్టీ కోసమే… అనుయాయులు పబ్బం గడుపు కోవడం కోసం… అలాగే ఇటు విజయసాయిరెడ్డి, అటు వైవీ సుబ్బారెడ్డి ల ప్రాభవం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఇక విశాఖ రాజధాని అని చెప్పిన జగన్ ప్రభుత్వం…

అది పక్కన పెట్టి…ఇంకేవో పనులు అభివృద్ధి అంటూ ఈ నాలుగేళ్ళ కాలయాపన చేసిందని విమర్శించారు… నాగార్జున.అనంతరం మాజీమంత్రి కోండ్రు మురళీ మాట్లాడుతూ..మళ్ళీ జగన్ ను సీఎం చేస్తే…రాష్ట్రం అథోగతి అవడం ఖాయమని అన్నారు. ఇప్పటికే పదివేల కోట్ల అప్పు చేసిందని… ఈ చివరి ఒక్క ఏడాది లో మరో వంద కోట్ల అప్పునకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోండ్రు మురళి అన్నారు.

Related posts

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు మాస్కులు

Satyam NEWS

వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలి

Murali Krishna

నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుక నిర్వహించుకోవాలి

Satyam NEWS

Leave a Comment