వనపర్తి జిల్లాలో గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో వుంచుకోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9గంటలనుండి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. జిల్లాలో నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. తీపిగుర్తులతో గడిచిపోతున్న 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న 2023 సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమనిబంధనలు పాటించాలని కోరారు.
డ్రంక్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తామని ఇందుకోసం జిల్లా పరిధిలో మొత్తం ముప్పై కి పైగా వాహన తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో వాహన డ్రైవింగ్ అనుమతించకూడదని కోరారు. త్రిబుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలను నడపడంతో పాటు సైలెన్సర్ తొలగించి వాహనాలను నడపటం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
అలాగే వాణిజ్య సముదాయాలు నిర్ధేశించిన సమయానికి మూసివేయాలని, డీజేలు, ఇతర శబ్ధ కాలుష్యాన్ని ఏర్పరిచి ఇతరులకు ఇబ్బంది కలిగించే వాటికి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రమాదం పొంచి వున్నందున పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోరాదని, కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పు వున్నందున వీలైనంత వరకు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాలతో చేసుకోవాలని కోరారు. వనపర్తి జిల్లా పరిధిలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇండ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్