ఖమ్మం చర్చి కాంపౌండ్ ముత్యాలమ గుడి సెంటర్ లో మండుతున్న భానుడు భారి నుండి సమస్త జనులను కాపాడాలని భారీ వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ దేవాలయం రజక సంఘం సభ్యులు 24 , 25 డివిజన్ నుండి బిందెలతో సుమారుగా 150 మంది ర్యాలీగా బయలుదేరి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి జలాలతో , పాలతో అభిషేకం చేశారు .
అలాగే సంకల్ప బలంతో శాశ్వతంగా సకల జనుల తాగునీటి కష్టాలను మహాయజ్ఞం సంకల్పంతో తీర్చిన సీఎం కేసీఆర్ కు , అభివృద్ధి లో ఖమ్మం ను ముందంజలో ఉంచిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో గోలి రామారావు , చింతల రేణుక పంతంగి సైదులు , జీడిమెట్ల చిన్న , నెల్లుట్ల ఆనంద్ , జీడిమెట్ల మల్లేష్ మరియు అధిక సంఖ్యలలో మహిళలు పాల్గొన్నారు .