జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత ఆర్మీ అధికారితోపాటు నలుగురు జవాన్లను బలి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూంచ్ సెక్టార్ లో సూరంకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో ఆపరేషన్ సంయుక్త బలగాలు చేపట్టాయి.
అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ చేస్తుండగా, ఉగ్రవాదులు దొంగచాటుగా దెబ్బకొట్టారు. ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, మరో నలుగురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు.