ఉత్తరాఖండ్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి యశ్పాల్ ఆర్య తన కుమారుడితో కలిసి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఈ అనూహ్య పరిణామం ఉత్తరాఖండ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర మంత్రి యశ్పాల్ ఆర్యా బీజేపీకి రాజీనామా చేయడం ..కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. మంత్రి యశ్పాల్ ఆర్యతో పాటు ఆయన కుమారుడు ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే సంజీవ్ కూడా కాంగ్రెస్లో చేరారు.