శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు ప్రారంభించారు. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ లెక్కింపు లో కరెన్సీ నోట్ల ద్వారా రూ.41,26,562-00 ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి ఓ ప్రేమకుమార్ రావు తెలిపారు.
అదే విధంగా చిల్లర నాణాల ద్వారా ఆదాయం, వెండి, బంగారు వస్తువుల వివరములు, శ్రీ స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు రేపు నిర్వహిస్తారు. ఈ హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ దేవాదాయ-ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ జి. శ్రీనివాసరాజు పర్యవేక్షణలో జరిగింది.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈ. ఓ. ప్రేమకుమార్ రావు, ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ, అర్చక, సిబ్బంది పాల్గొన్నారు.