ఈ కరోనా విపత్తు సమయంలో ఏ చిన్న కష్టమొచ్చినా నా అనే వాళ్ళు ముందుకొచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో ఎదుట ఆరుబయట ఒక కురువృద్ధుడు 70 గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి హీరా భాయ్ భిక్షాటనతో రైలు మార్గంలో వచ్చి ఆదిలాబాద్ రిమ్స్ ఎదుటకు చేరాడు. చావు బ్రతుకుల్లో ఉన్న హీరా భాయ్ ని ఎవరు పట్టించుకోవడం లేదని సమాచారం మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగంలోకి దిగింది.
యువజన సంఘాల ప్రతినిధులు వారు దగ్గరుండి అతనికి స్నానం చేయించి కొత్త దుస్తులు వేయించారు. భోజనం, మందులు ఏర్పాటు చేసి వారి ఉదార భావాన్ని చాటుకున్నారు. హీరా భాయ్ చనిపోయే పరిస్థితి ఉందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాల శంకర్ కృష్ణ తెలిపారు.
రెడ్ క్రాస్, యువజన సంఘాల సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల శంకర్ కృష్ణ యువజన సంఘాల జిల్లా గౌరవ అధ్యక్షురాలు శశికళ చౌహాన్ శ్వాస్ అధ్యక్షులు కారంగుల ప్రణయ్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు అనిల్ లోకండే పెద్ది వారి శశికాంత్ దొంతుల ప్రవీణ్ మేడిపల్లి ప్రమోద్ అనిల్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.