29.7 C
Hyderabad
April 29, 2024 07: 10 AM
Slider మహబూబ్ నగర్

విలేకరుల ప్లాట్ల డిప్పులో గందరగోళం

#journalist

వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, అధికారులు కలిసి వీడియో కెమెరా ద్వారా చిత్రీకించి డిప్పుధార కేటాయించిన వారిలో దురదృష్టవశాత్తు నిజమైన వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు రావడంతో వారికి డిప్పులో వచ్చిన నంబర్ గల ప్లాటు ఇవ్వలేదని, తమకు ప్లాటు పట్టా ఇవ్వలేదని తెలుగు టివి జర్నలిస్టు కె. వెంకటేశ్వార చారి(చిన్న) సెల్ నంబర్ 9000093729 తెలిపారు. డిప్పు కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు నాయకులకు, ఎవరికి తెలియకుండా   అధికారులు వేరే వాళ్లకు ఆ ఇంటి స్థలాల పట్టాలను కేటాయించారని, డిప్పులో వచ్చిన ప్లాట్ల నంబర్లు ప్రకటించాలని అయన కోరారు.  డిప్పులో వచ్చిన ప్లాట్ల నంబర్లు మార్పులు చేసినట్లు అనుమానంగా ఉందని చెప్పారు.  రాయి, బండ ఉన్న ప్లాట్ల నంబర్లు డిప్పులో వచ్చిన వివరాలు బయట పెట్టాలని కోరారు.    నాయకులు, అధికారులు స్పందించి  వర్కింగ్ జర్నలిస్టుల లందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని, డిప్పులో  ప్రకటించిన ప్లాటు నంబర్ పట్టా తమకు ఇవ్వాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

జయంత్ ఇన్ అండ్ యాజ్ జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్”

Satyam NEWS

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరిన సీఎం

Satyam NEWS

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment