37.2 C
Hyderabad
May 6, 2024 22: 41 PM
Slider నల్గొండ

వైఎస్ ఆశయ సాధనకు వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి

#aderla

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం శ్రీమతి వైయస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి సంక్షేమం,సమానత్వం,స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఊరూరా వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలని అన్నారు.

వైఎస్ఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేశారని గుర్తు చేశారు.అంతటి మహనీయుని  తనయురాలు వైయస్ షర్మిల తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మనందరి మంచికోసం వస్తున్న సందర్భంగా వారికి  చేయూతను అందించి,పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

అనంతరం వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు శ్రీనివాస రెడ్డి సమక్షంలో  వైఎస్ఆర్ తెలంగాణా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బలుసుపాటి రవి,బాపనపల్లి రవిందర్,పిక్కిలి మహేష్,తోట సాయ్,గుంజ ఉపేందర్,ఏలూరి ఏసు,వెంకట్ రెడ్డి నిమ్మల సాయి,తోట సాయి,వినోద్ పుట్టపాకుల గోపి,చల్లా వీరబాబు,చిలకల వీరబాబు, దొంగల వినోద్,జయంత్,తుపాకుల వీరస్వామి,పిండ్రాతి రామారావు,కారింగుల హరీష్,వెంకన్న,శ్రీనివాసరెడ్డి, చిన్నపరెడ్డి, గోవింద్,బాలరెడ్డి,జయభారతిరెడ్డి, గోవిందమ్మ,అరుణమ్మ,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

Satyam NEWS

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

గద్దర్ కొత్త పార్టీ

Bhavani

Leave a Comment