సావారిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రేడ్స్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కోదండపాణి చైర్మన్ సుల్తాన్ పాషా దివంగత జర్నలిస్టు హబీబ్ ఖాన్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
శనివారం హబీబ్ ఖాన్ నివాసానికి వెళ్లి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా 50 వేల రూపాయల చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కోదండపాణి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా హబీబ్ తో అనుబంధం ఉందని మృదుస్వభావి అయిన హాబీబ్ మరణం చాలా దురదృష్టకరమన్నారు.
ఆయన కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తమ వంతు సాయంగా హాబీబ్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
హబీబ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి జర్నలిస్టులు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.