28.7 C
Hyderabad
April 28, 2024 04: 41 AM
Slider నల్గొండ

మహిళా అధికారులు వృత్తి ప్రావీణ్యం పెంపొందించుకోవాలి

#Nalgonda Police

మహిళా పోలీస్ అధికారులు పోలీస్ శాఖలోని అన్ని అంశాలలో భాగస్వామ్యం అవుతూ తమ వృత్తి ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.

శనివారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో మా ప్రతి పథం – ప్రగతి రథం – తెలంగాణ మహిళా పోలీస్ పేరుతో మహిళా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో పోలీసుల పట్ల మరింత నమ్మకం పొందే విధంగా విధి నిర్వహణ చేయడం, మహిళా సమస్యల పట్ల మహిళా పోలీస్ అధికారులు చొరవ చూపించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం పెంపొందించాలని సూచించారు.

మహిళల భద్రతకు అత్యంత అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల సంక్షేమంపై అధిక శ్రద్ద వహిస్తున్నదని ఆయన చెప్పారు. పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని, పురుషులతో సమానంగా అన్ని అంశాలలో ప్రావీణ్యం పొందాలని ఆయన చెప్పారు.

ప్రస్తుత సమాజంలో మహిళా సంబంధిత సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా మారిందని ఆయన గుర్తు చేశారు. పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంచే బాధ్యత ప్రతి ఒక్క మహిళా పోలీస్ అధికారి పైన ఉన్నదని చెప్పారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిలలో 33% మహిళా పోలీస్ అధికారులున్నారని ఇది గర్వించదగ్గ విషయమని చెప్పారు.

మహిళా పోలీసు సిబ్బందికి సౌకర్యాలు

తెలంగాణ ప్రభుత్వం మహిళా పోలీస్ అధికారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ వారి గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాలలో పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, రాబోయే రోజులలో మరిన్ని మార్పులు వస్తాయని, అందులో భాగంగా మహిళా అధికారుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పోలీస్ శాఖలో పై స్థాయి అధికారులు మహిళా సిబ్బందికి సముచిత గౌరవం ఇస్తూ వారితో విధి నిర్వహణ చేయించడం ద్వారా ఉత్తమ ఫలితాల ఫలితాలు సాధించాలని డిఐజి సూచించారు. మహిళా భద్రతకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నామో అదే సమయంలో మహిళా పోలీస్ అధికారుల భద్రతకు అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంచుకోవాలి

ప్రతి మహిళా పోలీస్ అధికారులంతా వారి ఉద్యోగాన్నిమారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న పరిస్థితుల్లో మహిళా అధికారులు ఆ దిశగా ముందడుగు వేయాలని డిఐజి రంగనాధ్ సూచించారు.

పోలీస్ శాఖలో అమలు చేస్తున్న వర్టీకల్స్ సమర్ధవంతంగా అమలు చేయడానికి మహిళా సిబ్బందికి వాటి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ అధికారులకు బ్యారక్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులతో పాటు మహిళా అధికారులు నేర విచారణ, కేసుల నమోదు, కంప్యూటర్ నిర్వహణ, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటి అన్ని అంశాలలో భాగస్వామ్యం చేసే విధంగా మహిళా సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల వారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సమావేశంలో పలువురు మహిళా అధికారులు మాట్లాడుతూ తమను అన్ని విభాగాలు, అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేసేలా పై స్థాయి అధికారులు ప్రోత్సహిస్తే తాము వృత్తిలో రాణించగలుగుతామని, వృత్తి రీత్యా అనుభవం పెరుగుతుందని, మహిళా పోలీస్ అధికారులకు ఆత్మరక్షణకు అవసరమైన అంశాలలో శిక్షణ ఇప్పించాలని పలువురు మహిళా పోలీస్ అధికారులు కోరారు.

సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఎస్.ఐ. మౌనిక, నాగలక్ష్మి, విజయాబాయి, రేవతి, ఏ.ఎస్.ఐ.లు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డులు పాల్గొన్నారు.

Related posts

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

దళిత జర్నలిస్టు లాకప్ హింస కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

Satyam NEWS

అలుపెరుగని బాటసారమ్మ!

Satyam NEWS

Leave a Comment