కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బీడీ కార్మికుల కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేసి కాలనీల్లో అంతర్గత రోడ్లు మురికి కాలువలు నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం పలు ఇండ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎన్ .రాజు శ్రీహరి, మండల తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, ఏఎంసీ చైర్మన్ మల్లిఖార్జున్, డాక్టర్ రాజు, సాగర్ టైలర్ లబ్ధిదారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జీ.లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం