అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. బుధవారం ములుగు బాలికల పాఠశాలలోని విద్యార్థులకు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అందించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ విద్యతోనే అనుకున్నది సాధించవచ్చని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదలతో చదవాలని తస్లీమా అన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకొని, బాల్య వివాహాలపై పోరాడాలని తస్లీమా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత కుమారి, ప్రమీల, స్వాతి, కవిత, సర్దార్ సింగ్, సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.
previous post