28.7 C
Hyderabad
May 6, 2024 08: 44 AM
Slider మహబూబ్ నగర్

అయిజ తిరుమల్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి

గద్వాల జోగుళాంబ జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆయిజ మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమల్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం విదితమే.

ఈ సందర్భంగా నిన్న వారి స్వగ్రామం ఉత్తనూర్ లో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని నివాళులర్పించారు
ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సంతాప సభ, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి తో ఉన్న సానిహిత్యాని గుర్తు చేశారు.తిరుమల్ రెడ్డి జిల్లాలో మండలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని గుర్తు చేశారు. ప్రజల మనిషిగా మెలిగారని వారి రాజకీయ ప్రస్థానంలో ఎంపీపీ గా జెడ్పిటిసి గా ప్రజలకు సేవచేసేందుకు కృషి చేశారన్నారు.

అలాంటి వారు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎల్లప్పుడూ తిరుమల్ రెడ్డి కుటుంబసభ్యులకు వారి శ్రేయోభిలాషులకు అండగా ఉంటానని వారి మృతి ఎంతో కలచివేసిందని వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమూల్ సంస్థ సంగం డైరీ కి పోటీయే కాదు: ధూళిపాళ్ళ

Satyam NEWS

వేడుకగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఉత్సవాలు

Satyam NEWS

నవంబర్ నెలలో శివ సాయి నగర్ ఫేస్ 3 బ్రిడ్జి నిర్మాణం పనులు

Satyam NEWS

Leave a Comment