ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా విధానాలు) పదవికి రాజీనామా చేశారు. కె.రామచంద్రమూర్తి తన రాజీనామాను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సమర్పించారు.
తన రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని ఈ సందర్భంగా రామచంద్రమూర్తి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల పాత్రికేయుల్లో కె.రామచంద్రమూర్తి ఎంతో సీనియర్. అనేక దినపత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు.
ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులను నియమించగా, వారిలో కె.రామచంద్రమూర్తి కూడా ఉన్నారు.