40.2 C
Hyderabad
May 5, 2024 16: 17 PM
Slider క్రీడలు

సూర్యాపేట జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

#prokabbadi

త రెండు రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని క్యాంప్ స్కూల్ ఆవరణలో సూర్యాపేట జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సీనియర్ టోర్నమెంట్ కం సెలెక్టన్స్ లో విజేతలుగా పురుషులలో కోదాడ టీమ్ మొదటి బహుమతి,ద్వితీయ బహుమతి హుజుర్ నగర్ టీమ్,మహిళలు మొదటి బహుమతి మెళ్ళచెరువు టీమ్,ద్వితీయ బహుమతి హుజుర్ నగర్ టీమ్ గెలుచుకున్నారు.ఉత్తమ రైడర్ గా సంతోష్,డిఫెండర్ గా వినయ్,మహిళలలో ఉత్తమ రైడర్ కృష్ణవేణి,డిఫెండర్ చైతన్య భవాని ఎంపిక అయ్యారు.

ఈ పోటీలలో పురుషులు 20 మందిని,మహిళలు 20 మందిని ఎపిక చేయడం జరిగింది.వీరికి త్వరలో కోచింగ్ క్యాంప్ నిర్వహించి అందులో ఉత్తమ క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం అని అధ్యక్ష్య,ప్రధాన కార్యదర్శి రామచందర్ గౌడ్,నామ నరసింహరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, సునీల్,నాగిరెడ్డి,గఫ్ఫార్,అలీ,రమేష్, సైదులు,మస్తాన్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

Satyam NEWS

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

Satyam NEWS

జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది

Satyam NEWS

Leave a Comment