33.2 C
Hyderabad
May 12, 2024 12: 24 PM
Slider ఖమ్మం

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు

#Kandala changed

స్వలాభం కోసమే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలోకి చేరారని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ముత్యాలగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కందాల పోటీ చేసిన సమయంలో ఎవరైతే ఆయన గెలుపునకు కృషి చేశారో వారంతా ఆయనతో పాటు అధికార పార్టీలోకి చేరలేదనే కోపంతో వారికున్న అధికార మదాన్ని ప్రయోగించి వారిపై అక్రమ కేసులను పెట్టించి జైళ్లకు పంపించడం జరిగిందన్నారు.

బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయని మరో మూడు నెలల్లో ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గోడకు సున్నం కొట్టినంత సులువుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న స్టంట్లు అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నార.

Related posts

మీల్ ఫర్ పూర్:మహారాష్ట్రలో రూ.10కే ‘శివ భోజన్‌’

Satyam NEWS

ధర పెరిగితే ఏం? నేను ఉల్లి తిననుగా

Satyam NEWS

కన్నుమూసిన ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి

Satyam NEWS

Leave a Comment