అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్ర కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవాలు ఉదయం సాయంత్రం నిర్విరామంగా కొనసాగుతున్నది. దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి నేతృత్వంలో భక్తుల సహకారంతో దేవాలయం తో పాటు శివాలయం, నవగ్రహ మండపం, శ్రీశేష దాసుల బృందావనం, చింతల ముని రంగస్వామి దేవాలయాల దగ్గర కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తులు భక్తి పారవశ్యంలో తన్మయులవుతున్నారు. శివ కేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే కాశీలో వేయి దీపాలు వెలిగించిన పుణ్యం ప్రసాదిస్తారని ఆదిశీలా క్షేత్ర గిరిశాచల మహత్యంలో చెప్పబడినది. సోమవారం పరమశివునికి ప్రీతికరమైన వారం సందర్భంగా కార్తీకదీపం పోటీపడి వెలిగించారు.
previous post