కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టుకు నూతన న్యాయమూర్తిగా కావ్య బాధ్యతలు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లో నూతనంగా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కావ్య కు సోమవారం సీనియర్ న్యాయవాదులందరూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో న్యాయమూర్తి నల్గొండ జిల్లా నకిరేకల్ కోర్టు లో విధులు నిర్వహించిన వారు బదిలీ పై కల్వకుర్తికి చేరుకున్నారని తెలిపారు.
న్యాయవాదుల సమస్యలపై వారు చర్చించారని సానుకూలంగా స్పందించారని అన్నారు. అనంతరం న్యాయమూర్తి కావ్య మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు వెంకట్ రెడ్డి, కృష్ణయ్య, వెంకట్ గౌడ్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, లక్ష్మణ్ రాజ్ ,జయంత్, శ్రీకాంత్, జమీల్ అహ్మద్ రాంగోపాల్ మల్లేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు