వారిద్దరూ రాజకీయాలలో అత్యంత ఆత్మీయంగా మెలిగిన వారు. ఇద్దరూ మంత్రులుగా పని చేశారు. వారే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ని సిఎం కేసీఆర్ పలుకరించారు.
గత కొద్ది కాలంగా ఆరోగ్యం సరిగా లేక పోవడంతో రాజకీయ కార్యకలాపాలలో గోపాలకృష్ణారెడ్డి పాల్గొనడం లేదు. మిత్రత్వానికి విలువనిచ్చే కేసీఆర్ నేడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గోపాలకృష్ణారెడ్డి కుటుంబంతో కొద్ది సేపు గడిపారు. కేసీఆర్ తో బాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.