38.2 C
Hyderabad
May 3, 2024 19: 45 PM
Slider ముఖ్యంశాలు

29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన

#kishanreddy

తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ అవుతారని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకులతో  కిషన్ రెడ్డి చర్చించారు. ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ సిద్ధమైంది.

29వ తేదీ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో.. అమిత్ షా భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో పార్టీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోని తీసుకొచ్చే విషయంలో పార్టీ కేడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కులసంఘాలు, సామాజిక సంఘాల, నాయకులతో అమిత్ షా సమావేశమయ్యేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related posts

గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికిస్తే ఊరుకోం

Satyam NEWS

డి ఎస్ ఆర్ ట్రస్ట్ చొరవతో నిలబడిన ప్రాణం

Satyam NEWS

మళ్లీ మళ్లీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

Satyam NEWS

Leave a Comment