తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవం సందర్భంగా సంబరాలు నిర్వహించి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు.
తొలుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం నందు కేక్ కట్ చేశారు.నగరంలోని క్యాంపులో గల వృద్ధాశ్రమం నందు వృద్దులకు పండ్లు, బ్రెడ్ లను పంపిణీ చేశారు. అన్నం సేవాశ్రమంలో ఆశ్రమం ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ను పంపిణీ చేశారు.