ఖమ్మం నగర ప్రజలకు మరో ఆణిముత్యం రూపు దిద్దుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషి మేరకు ఖానాపురం ఊర చెరువు అభివృద్ధి చేసి ఖానాపురం మినీ ట్యాంక్ బండ్గా నామకరణం చేసి ఖమ్మం ప్రజలకు అందించనున్నారు. ఆయా పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఫ్లోటింగ్ ఫౌంటెన్ తో పాటు వాకింగ్ ట్రాక్, చుట్టు పాల్మ్ మొక్కలు, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆహ్లాదం కోసం ఆటవస్తువులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పూర్తిగా ముస్తాబు చేసి అతి త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ప్రారంభించుకుని నగర ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
previous post
next post