దాదాపుగా 55 కోట్ల రూపాయలతో కొల్లాపూర్ మునిసిపాలిటీ బడ్జెట్ ను మునిసిపాలిటీ పాలకవర్గం నేడు ఆమోదించింది. కొల్లాపూర్ మునిసిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి అధ్యక్షతన నేడు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కొత్త లైబ్రరీ బిల్డింగ్ లో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పడిన తర్వాత ఇది తొలి సమావేశం. ఈ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యులులైన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య బడ్జెట్ ప్రతిపాదనలు సమావేశానికి వివరించారు. మునిసిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి, వైస్ చైర్మన్ మహముదా బేగం కౌన్సిలర్స్ శ్రీదేవి గౌతం గౌడ్, మేకల రమ్య నాగరాజు, మేకల శిరీష కిరణ్ యాదవ్, బోరెల్లి కరుణ మహేష్, హేమావతి ఏళ్ల గౌడ్, షేక్ రహీం పాషా, నయిం, జ్యోతి, బడా అనిత, బాలస్వమి, సత్యం, కృష్ణ, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 2020-2021 సంవత్సరానికి కొల్లాపూర్ మునిసిపాలిటీ బడ్జెట్ 54 కోట్ల 27లక్షల 10 వేల రూపాయలుగా ఉంటుంది.